మేడారం మహాజాతరకు అంకురార్పణ

మేడారం మహాజాతరకు అంకురార్పణ

మేడారం మహాజాతరకు అంకురార్పణ జరిగింది. వైభవంగా మేడారంలో సమ్మక్క సారక్కల మండమెలిగే పండుగ ప్రారంభం అయ్యింది. డోలు వాయుద్యాలు, కోయ పూజారుల ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవార్లను దర్శించుకుని ఏర్పాట్లు పర్యవేక్షించారు మంత్రి సత్యవతి రాథోడ్. మండమెలిగే పండగలో ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా పాల్గొన్నారు. మండమెలిగే పండుగ రోజు మేడారం, కన్నెపల్లిలో సమ్మక్క, సారలమ్మ గుడుల్లో అలుకు పూతలు చేసి ముగ్గులు వేస్తారు. రెండు గ్రామాలకు బూరక గుంజలతో ద్వార స్తంభాలు ఏర్పాటు చేసి రక్షా తోరణాలు కడతారు. గ్రామ దేవతలకు పూజలు చేసి జాతర ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగేలా చూడాలని వేడుకుంటారు. 

రాత్రికి గద్దెల ప్రాంగణంలో జాగరణ చేసి.. మేకలను బలిచ్చి నైవేద్యం సమర్పిస్తారు.  ఈ నెల 16 నుంచి నాలుగు రోజుల పాటు సాగే మేడారం జాతరకు ప్రారంభంగా పూజరులు మండమెలిగే పండగ నిర్వహిస్తారు. దీంతో మేడారం, కన్నెపల్లి గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. మండమెలిగే పండగ సందర్భంగా గుడిని, సమ్మక్క, సారలమ్మ అమ్మవార్ల గద్దెలు, అలంకరించి వన పూజారులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

ఇంజిన్ కవర్ లేకుండానే ఎగిరిన విమానం

ఇదెక్కడి రాజ్యాంగ విధానం మోదీ గారు?