బాసర ట్రిపుల్ ఐటీ ఘటన ప్రకంపనలు సృష్టిస్తోంది. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ జరిగిన సంగతి తెలిసిందే. ఘటన జరిగిన అనంతరం ప్రభుత్వం సీరియస్ గా స్పందించకపోవడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. విద్యార్థుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి ప్రాధాన్యం ఇవ్వడం లేదని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జీ మాణిక్కం ఠాగూర్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకోని ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని, ఆదాయం, జేబులు నింపుకోవడానికి మాత్రమే శ్రద్ధ వహిస్తున్నారని దుయ్యబట్టారు. కొడుకు, అల్లుడి రాజ్యాన్ని అంతం చేయాలని పిలుపునిచ్చారు. రేవతి చేసిన ట్వీట్ ను ఆయన రీ ట్వీట్ చేశారు.
ఫుడ్ పాయిజన్ పై అధికారుల విచారణ కొనసాగుతోంది. రెండు క్యాంటీన్లపై కేసు నమోదు చేసిన అధికారులు వాటి టెండర్లు రద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని ట్రిపుల్ ఐటీ సిబ్బంది తెలిపారు. నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి నుంచి 9 మంది డిశ్చార్జి అవగా..మరో నలుగురు చికిత్స పొందుతున్నారు. ట్రిపుల్ ఐటీ స్టూడెంట్లు ఆందోళనలు చేపట్టి నెల గడవక ముందే మళ్లీ ఫుడ్ పాయిజన్ అవడంతో విద్యార్థుల తల్లిద్రండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Priority for TRS Education minister continues to be other than Students welfare. TRS government days are numbered as they don’t care about Telangana. They only care about Income and filling their pockets… Koduku Alludu Raj must End . https://t.co/soUHfyibgR
— Manickam Tagore .B??✋மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) July 16, 2022