తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే!

తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే!

2023లో 78 సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ స్థాయి బూత్ కమిటీల డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై సమీక్ష జరిపారు. గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీతో మోడీ, కేసీఆర్ వ్యవహరిస్తున్నారని అన్నారు. TRS ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందని తెలిపారు. కేసీఆర్ అవినీతిపై మాట్లాడే బీజేపీ నేతలు ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. ఇద్దరికి సఖ్యత ఉంది కాబట్టే ఎలాంటి ఈడీ దాడులు జరగడం లేదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ తో దొంగనాటకాలాడుతున్నాయని మాణిక్యం ఠాగూర్ తెలిపారు. తెలంగాణ ప్రజలు దీన్ని అర్థం చేసుకుంటారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ మొదటి గెలుపు షాద్ నగర్ నుంచే ప్రారంభం అవుతుందన్నారు. 

మరిన్ని వార్తల కోసం

పార్లమెంటులో బీజేపీ తరపున ఒక్క ముస్లిం ఎంపీ కూడా ఉండరు..!

పాంథర్స్ పార్టీ వ్యవస్థాపకులు భీంసింగ్ ఇక లేరు