కాంస్య పతకం సాధించిన బాక్సర్ మనీషా మౌన్

కాంస్య పతకం సాధించిన బాక్సర్ మనీషా మౌన్

మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో హర్యానా బాక్సర్ మనీషా మౌన్ అదరగొట్టింది. ఇస్తాంబుల్లో జరుగుతున్న మెగా టోర్నీలో మనీషా బ్రౌంజ్ మెడల్ను సాధించింది. 57 కేజీల విభాగంలో సెమీస్ చేరిన మనీషా మౌన్..ఇటలీకి చెందిన ఇర్మా టెస్టా చేతిలో 0-5 స్కోరు తేడాతో ఓడింది. సెమీస్లో ఓడిపోయినా ..మనీషా కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.

మనీషా కాంస్య పతకం సాధించడంపై బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా శుభాకాంక్షలు తెలిపింది. కంగ్రాట్స్ ఛాంప్ అంటూ ట్విట్టర్లో షేర్ చేసింది.