
2017లో మిస్ వరల్డ్ టైటిల్ కైవసం చేసుకున్న మానుషి చిల్లర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోందనే ప్రచారం సాగుతోంది. ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మానుషి.. తెలుగు సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్ సింగ్ రూపొందించనున్న చిత్రంలో హీరోయిన్గా ఆమెను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.
వరుణ్ తేజ్ పదమూడో చిత్రంగా తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ డిసెంబర్ నుంచి స్టార్ట్ కానుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్డ్రాప్లో, రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కించబోతున్నారు. ఇందులో వరుణ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్గా నటిస్తున్నాడు. సోని పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ సంస్థ ప్యాన్ ఇండియా మూవీగా నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే.. మానుషి ప్రస్తుతం ద గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ, తెహ్రాన్ అనే మరో రెండు హిందీ చిత్రాల్లో నటిస్తోంది.