దండకారణ్యంలో దండుకట్టిన్రు.. ఘనంగా మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు

దండకారణ్యంలో దండుకట్టిన్రు.. ఘనంగా మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు
  • మావోయిస్టు కేంద్ర కమిటీ, పొలిట్​బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్​కు నివాళి

భద్రాచలం, వెలుగు: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన భద్రతా బలగాల కండ్లను గప్పి ఛత్తీస్​గఢ్​ దండకారణ్యంలో  జులై 28నుంచి ఈనెల 3 వరకు మావోయిస్టు పార్టీ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్​, దక్షిణ బస్తర్​ డివిజన్​ కమిటీ అధికార ప్రతినిధి గంగాల్​శనివారం ఈ వివరాలు వెల్లడించారు.. తెలంగాణ-–ఛత్తీస్​గఢ్​ రాష్ట్రాల సరిహద్దుల్లోని బీజాపూర్​-సుక్మా జిల్లాల పరిధిలోని  చిన ఊట్లపల్లి గ్రామ అటవీ ప్రాంతంలో 5వేల మంది ఆదివాసీలతో 2 కి.మీల ర్యాలీతో  మావోయిస్టులు  సభా ప్రాంగణానికి చేరుకున్నారు.

 మూడంచెల కట్టుదిట్టమైన భద్రత మధ్య ఇటీవల మరణించిన మావోయిస్టు కేంద్ర కమిటీ, పొలిట్​బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్​ ఆలియాస్ ఆనంద్​ స్మారక స్తూపం వద్ద నివాళి అర్పించారు.  వారోత్సవాల నేపథ్యంలో దండకారణ్యంలో పోలీసు బలగాలు ఆపరేషన్​ మాన్​సూన్​ పేరుతో కూంబింగ్​లు నిర్వహించాయి.  సరిహద్దున ఉన్న తెలంగాణ రాష్ట్రంలోనూ పోలీసులు అలర్ట్​ అయ్యారు. అయినా మావోయిస్టు పార్టీ దండకారణ్యంలో భారీగా బహిరంగ సభ పెట్టి, ర్యాలీ నిర్వహించి అమరవీరులకు నివాళి అర్పించింది.