
భద్రాచలం, వెలుగు: మావోయిస్టులు మరో టీచర్ను చంపిన ఘటన చత్తీస్గఢ్లో జరిగింది. బీజాపూర్జిల్లా గంగులూరు పోలీస్స్టేషన్పరిధి తోడ్కా గ్రామానికి చెందిన టీచర్కల్లూ తాతి(27) డ్యూటీ నుంచి తిరిగొస్తుండగా శుక్రవారం రాత్రి మావోయిస్టులు కిడ్నాప్చేశారు. పోలీసులకు ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్నాడనే నెపంతో చిత్రహింసలకు గురి చేసి కత్తులతో పొడిచి చంపారు. రెండు రోజుల కిందే సుక్మా జిల్లా సిల్గేర్ గ్రామంలో టీచర్ లక్ష్మణ్బార్సేను హత్య చేసిన సంగతి తెలిసిందే. మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో మూతపడిన స్కూళ్లను తిరిగి తెరిచాక టీచర్లను టార్గెట్గా చేసుకున్నారు. బీజాపూర్ జిల్లాలో 5 మంది, సుక్మా జిల్లాలో నలుగురు టీచర్లను మావోయిస్టులు హత్య చేశారు. ఆయా ఘటనలతో గిరిజన గ్రామాలు భయంతో వణికిపోతున్నాయి.