మార్చి 22న తెలంగాణకు కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్

మార్చి 22న తెలంగాణకు కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్
  • తెలంగాణకు రానున్న జస్టిస్​ ఘోష్

హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్​జరుపుతున్న విచారణ తుది దశకు చేరుకున్నది. ఇప్పటికే ప్రాజెక్ట్​అధికారులు, ఈఎన్ సీలు, రిటైర్డ్​ ఈఎన్ సీలు, ఇంజనీర్లు, ఐఏఎస్​అధికారులు, కాగ్​ అధికారులు సహా112 మంది నుంచి స్టేట్ మెంట్లను కమిషన్ రికార్డ్​ చేసింది. అధికారుల విచారణ పూర్తవడంతో.. ఇక కమిషన్​తన పూర్తి స్థాయి ఫోకస్ అంతా రిపోర్ట్ పైనే పెట్టింది. ఇప్పటికే డ్రాఫ్ట్ రిపోర్టును తయారు చేసుకుంటున్న కమిషన్​ చైర్మన్​జస్టిస్​ పినాకి చంద్రఘోష్​.. పూర్తిస్థాయి నివేదికనూ ప్యారలల్​గా ప్రిపేర్​ చేస్తున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే శనివారం ఆయన రాష్ట్రానికి వస్తున్నారు.