
పద్మారావునగర్, వెలుగు: ఆరు గ్యారంటీ స్కీమ్లను అధికారంలోకి వచ్చాక వెంటనే అమలు చేస్తామని కాంగ్రెస్ఎన్నికల మేనిఫెస్టో కమిటీ మెంబర్ మర్రి ఆదిత్యారెడ్డి పేర్కొన్నారు. బన్సీలాల్పేట డివిజన్ సీసీ నగర్ లో ఆదివారం ఇంటింటికీ 6 గ్యారంటీ స్కీమ్లపై ప్రచారంలో భాగంగా పార్టీ నేతలు స్థానికులకు కార్డులను పంపిణీ చేశారు.
టీ పీసీసీ సెక్రటరీ ఎన్. విఠల్, రాజేందర్, శ్రీనివాస్, నారాయణ, లక్ష్మణ్, వేద ప్రకాశ్ యాదవ్, ఓరం ప్రియాంక, రాము, విలాస్, సురేశ్, సత్యనారాయణ, గణేశ్ ఉన్నారు.