
- ఇవి మస్తు అమ్ముడవుతయ్
- ఇందుకు 2-3 ఏళ్లు పడుతుంది
- మారుతి సుజుకీ చైర్మన్ భార్గవ
న్యూఢిల్లీ: రాబోయే రెండు మూడేళ్లలో చిన్న కార్ల సేల్స్బాగా పెరుగుతాయని మారుతి సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ చెప్పారు. అప్పటి వరకు జనం ఆదాయాలు మెరుగుపడతాయని చెప్పారు. మారుతి సుజుకీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో ఆశించిన ఫలితాలను సాధించింది. పెద్ద, ఖరీదైన కార్ల అమ్మకాలు బాగుండటమే ఇందుకు కారణం. ఎంట్రీ లెవెల్, చిన్న కార్ల అమ్మకాలు పెరగకుండా ఇండియా కార్ ఇండస్ట్రీ ఎదిగేందుకు అవకాశాలు తక్కువని అన్నారు.
భారతదేశంలో చిన్న కార్ల వాటా 2019 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలలో 85 శాతం ఉన్నాయి. అయితే కరోనా కారణంగా ఆటో ఇండస్ట్రీకి ఇబ్బందులు వచ్చాయి. సప్లై చెయిన్లు దెబ్బతినడం, రెగ్యులేటరీ రూల్స్ కఠినతరం కావడం వల్ల ధరలు బాగా పెరిగాయి. వాల్యూమ్ల పరంగా చిన్న కార్లు మారుతికి అతిపెద్ద సెగ్మెంట్గా ఉన్నప్పటికీ, వాటి అమ్మకాలు క్షీణించాయి.
'ఆల్టో', 'స్విఫ్ట్' హ్యాచ్బ్యాక్లతో సహా మినీ కాంపాక్ట్ కార్ల అమ్మకాలు అంతకు ముందు సంవత్సరంతో పోల్చిచూస్తే 58శాతం నుంచి 43శాతంకి పడిపోయాయి. ఇందుకు విరుద్ధంగా, యుటిలిటీ వెహికల్స్ విక్రయాలు పెరిగాయి. ఏడు-సీట్ల 'ఎర్టిగా' వంటి ఎస్యూవీలకు కస్టమర్ల నుంచి ఎక్కువ ఆదరణ ఉంది. మొత్తం వెహికల్స్ అమ్మకాల్లో వీటి వాటా 32 శాతం వరకు ఉంది. ఇది అంతకు ముందు సంవత్సరం 16శాతమే ఉంది. మారుతి సుజుకీ ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు క్వార్టర్లో రూ.3,716 కోట్ల లాభం సంపాదించింది.
గత రెండో క్వార్టర్లో దీనికి రూ. మూడు వేల కోట్ల లాభం వచ్చింది. అమ్మకాలను పెంచడానికి కంపెనీ హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇతర క్లీన్ టెక్నాలజీల ఆఫర్లను విస్తరించింది. మారుతి దగ్గర ప్రస్తుతం ఆరు హైబ్రిడ్ మోడల్స్ ఉన్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో తన మొదటి బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) ఉత్పత్తిని ప్రారంభించనుంది.
భారతదేశంలో హైబ్రిడ్ వెహికల్స్కు, ఈవీలకు మధ్య పన్ను వ్యత్యాసాన్ని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లయితే వాటి అమ్మకాలు పెరుగుతాయని భార్గవ చెప్పారు. హైబ్రిడ్లపై పన్నులను తగ్గించాలని టొయోటా కేంద్ర ప్రభుత్వం దగ్గర లాబీయింగ్ చేస్తోంది.