
విక్టోరిస్ పేరుతో మిడ్సైజ్ ఎస్యూవీని మారుతి సుజుకి బుధవారం లాంచ్ చేసింది. ఈ కారుకు భారత్ ఎన్క్యాప్ క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించడం విశేషం. ఇందులో 1.5-లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ స్ట్రాంగ్-హైబ్రిడ్, సీఎన్జీ వెర్షన్లు ఉన్నాయి.
పెట్రోల్ వేరియంట్లో మాన్యువల్ గేర్బాక్స్ తో పాటు ఆటోమేటిక్ గేర్బాక్స్ ఆప్షన్ ఉంది. హైబ్రిడ్ వెర్షన్ 28.65 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. విక్టోరిస్లో లెవెల్-2 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ఏడీఏఎస్), 6 ఎయిర్బ్యాగ్స్, 360-డిగ్రీ కెమెరా వంటి అనేక అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ధరల వివరాలను కంపెనీ వెల్లడించలేదు.