జహీరాబాద్ పట్టణంలోని .. హనుమాన్ మందిర ప్రాంగణంలో రక్తదాన శిబిరం

 జహీరాబాద్ పట్టణంలోని .. హనుమాన్ మందిర ప్రాంగణంలో రక్తదాన శిబిరం

జహీరాబాద్, వెలుగు: మహేశ్ నవమి సందర్భంగా జహీరాబాద్ పట్టణంలోని మార్వాడీ హనుమాన్ మందిర ప్రాంగణంలో మార్వాడీ సంఘం ఆధ్వర్యంలో బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. మొత్తం 79 మంది రక్తదానం చేశారు. ఈ రక్తాన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి అందించినట్లు నిర్వాహకులు తెలిపారు.

 చావుబతుకుల మధ్య ఉన్నవారి ప్రాణాలను రక్తం కాపాడుతుందని పేర్కొన్నారు. అనంతరం రక్తదానం చేసినవారిని సన్మానించారు. మార్వాడీ సంఘం, యువజన, మహేశ్వరి యువ సంఘటన సభ్యులున్నారు.