
హైదరాబాద్, వెలుగు: కరోనా కేసులు భారీగా పెగుతున్నా జనం నిర్లక్ష్యం వీడడం లేదు. మాస్కులు లేకుండా తిరుగుతున్నారు. ఇలాంటి వారిపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. గత11 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 62,711 మందిపై మాస్క్ వయొలేషన్ కేసులు నమోదు చేశారు. ఇందులో అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో16,569, సైబరాబాద్ 8,405, రాచకొండ 7,825, వికారాబాద్ 3,568, కరీంనగర్లో 2,536 కేసులు రిజిస్టర్ చేశారు. తక్కువగా ములుగు జిల్లాలో 222 నమోదయ్యాయి. మాస్క్ వయొలేషన్స్ కింద రూ.1,000 చలాన్ విధిస్తున్నారు. కాగా, ప్రతి స్టేషన్ లో రెండు స్పెషల్ టీమ్స్ మాస్క్ పెట్టుకోని వారి ఫొటో తీసి పేరు, మొబైల్, ఆధార్ నంబర్ వివరాలతో టీఎస్ కాప్ యాప్లో అప్లోడ్ చేస్తున్నాయి.