
నల్లమల్ల అడవిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫిబ్రవరి 1వ తేదీ గురువారం తెల్లవారుజామున నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలోని నల్లమల్ల అటవి ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దాదాపు 50 హెక్టార్ట విస్తీర్ణంలో మంటలు వ్యాపించాయి. దీంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు అగ్నిపమాపక సిబ్బంది.