నేపాల్ లో వాన బీభత్సం..17 మంది మృతి

నేపాల్ లో వాన బీభత్సం..17 మంది మృతి

నేపాల్ ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షాలు నేపాల్ లోని సదర్  పశ్చిమ్ ప్రావిన్స్ లో బీభత్సం సృష్టిస్తున్నాయి. అచ్చాం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి 17 మంది చనిపోయారు. కొండచరియల కింద చిక్కుకున్న మరో 11 మందిని సహాయ సిబ్బంది రక్షించారు. జిల్లా అధికారులు వారిని హెలికాప్టర్లలో సుఖేత్ జిల్లాకు తరలించి అక్కడ ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు తెలిపారు. మరో ముగ్గురు గల్లంతైనట్లు చెప్పారు.



పలు జిల్లాల్లో కొండచరియలు విరిగిపడటంతో.. సహాయక చర్యలు వేగవంతం చేశారు అధికారులు. గల్లంతైన వారికోసం హెలికాప్టర్ల ద్వారా గాలిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చన్నారు అధికారులు. రోడ్లపై కొండచరియలు విరిగి పడి అనే ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.