జమ్ములో ఉగ్రవాదులను ఏరివేస్తున్న పోలీసులు

జమ్ములో ఉగ్రవాదులను ఏరివేస్తున్న పోలీసులు

జమ్మూకశ్మీర్ లో భారీగా ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. భద్రతా దళాలు పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ చేపడుతున్నాయి. ఈనెల 30 నుంచి అమర్ నాథ్ యాత్ర మొదలవుతుండడంతో సెక్యూరిటీ టైట్ చేశారు. యాత్రికులపై ఎలాంటి దాడులు జరగకుండా ముందస్తుగా సెర్చ్ ఆపరేషన్స్ చేస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్స్ లో భాగంగా కుప్వారాలో జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. భద్రతా దళాలు, జమ్మూకశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టి టెర్రరిస్టులను హతమార్చారు. అటు పుల్వామా ఎన్ కౌంటర్ లో ఒక టెర్రరిస్ట్ హతమయ్యాడు. వీరు పాకిస్తాన్ కు చెందిన వారిగా గుర్తించారు. 
..
జమ్మూకశ్మీర్ లో సామాన్యులపై ఎటాక్స్ మొదలైన తర్వాత భద్రతా దళాలు మరింత అలర్ట్ అయ్యాయి. కూంబింగ్ ఆపరేషన్స్ ఎన్ కౌంటర్లలో గత 20 రోజుల్లో 23 మంది ఉగ్రవాదులను హతమార్చారు. గత 18 గంటల్లో 3 ఎన్ కౌంటర్లలో ఏడుగురు టెర్రరిస్టులను షూట్ చేశారు జవాన్లు. కుప్వారాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఉగ్రవాదుల నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. రెండేళ్ల తర్వాత అమర్ నాథ్ యాత్రకు భక్తులను అనుమతించడంతో ముందస్తుగా అలర్ట్ అవుతున్నారు.