సస్పెన్స్ థ్రిల్లర్ గా ‘మాయా పేటిక’

సస్పెన్స్ థ్రిల్లర్ గా  ‘మాయా పేటిక’

పాయల్ రాజ్‌‌పుత్‌‌, విరాజ్ అశ్విన్, సిమ్రత్ కౌర్, ర‌‌జ‌‌త్ రాఘ‌‌వ్, సునీల్, పృథ్వీరాజ్‌‌, శ్రీనివాస్ రెడ్డి, హిమ‌‌జ‌‌, శ్యామ‌‌ల ప్రధాన పాత్రల్లో న‌‌టిస్తున్న చిత్రం ‘మాయా పేటిక’. రమేష్ రాప‌‌ర్తి ద‌‌ర్శక‌‌త్వంలో మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్‌‌నాథ్ బొమ్మిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్‌‌‌‌ను గురువారం విడుదల చేశారు. మొబైల్ ఫోన్ మన జీవితాల్లో ఎంత కీల‌‌కంగా మారింది, దానికి ప్రపంచమంతా ఎలా దాసోహమైంది అనేది ట్రైలర్‌‌‌‌లో చూపించారు. ‘ఈ ప్రపంచంలోని మనుషులకు నాలుగు అవసరాలు ఉంటాయి. 

అవి ప్రేమ, డబ్బు, అధికారం, నేను’ అంటూ అందరి జీవితాల్లో తనొక భాగంగా ఎలా మారిందనేది సెల్‌‌ ఫోన్‌‌ వివరిస్తోంది.  ఇందులో ఓ హీరోయిన్‌‌ పాత్రను పాయల్ పోషించింది. తనతో పాటు మరో నలుగురి కథలు ఉన్నాయి. అవ‌‌న్నీ స్మార్ట్ ఫోన్‌‌కు ఎలా క‌‌నెక్ట్ అయ్యాయ‌‌నేది ఇంటరెస్టింగ్‌‌గా చూపించారు. మొత్తానికి సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌‌తో సాగిన ట్రైలర్‌‌‌‌ ఆకట్టుకుంది. ఈనెల 30న సినిమా విడుదల కానుంది