ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్..ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్న మాయావతి

ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్..ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్న మాయావతి

ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎన్డీయేకు జై కొట్టడంతో ఢిల్లీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.యూపీఏ ఛైర్ పర్సన్  సోనియా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ తో ఇవాళ జరగాల్సిన సమావేశాన్ని బీఎస్పీ అధినేత్రి మాయావతి రద్దు చేసుకున్నారు. మాయావతి ఢిల్లీకి రావడం లేదని లక్నోలోనే ఉంటారని ఆ పార్టీ వర్గాలు ప్రకటించాయి. బీజేపీయేతర పక్షాల సమావేశంలో గానీ సోనియా, రాహుల్ గాంధీలతో గానీ ఎలాంటి భేటీ ఉండదని తెలిపాయి. మరో వైపు లోక్నో వెళ్లి మాయావతిలో చర్చలు జరిపిన ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ  సోనియాగాంధీ, మమతా బెనర్జీతో భేటీ కానున్నారు.