పీవీని అవమానించిన కాంగ్రెస్..ప్రజలకు క్షమాపణ చెప్పాలి : యాదగిరి సునీల్‌‌‌‌రావు

పీవీని అవమానించిన కాంగ్రెస్..ప్రజలకు క్షమాపణ చెప్పాలి : యాదగిరి  సునీల్‌‌‌‌రావు

కరీంనగర్ టౌన్, వెలుగు : ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి బాటపట్టించిన మాజీ ప్రధాని పీవీ నరసింహరావును అవమానపరిచిన కాంగ్రెస్.. జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలని మేయర్ ​యాదగిరి  సునీల్‌‌‌‌రావు  డిమాండ్ చేశారు. శుక్రవారం  ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్  మునిగిపోయే  నావ లాంటిదని, ఆ పార్టీ తరఫున పోటీచేసేందుకు అభ్యర్థులే లేరని విమర్శించారు.  రానున్న ఎన్నికల్లో  ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్​13 సీట్లు కైవసం చేసుకుంటుందన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు మాధవి, రమణారావు, యాదయ్య, మహేశ్,  పాల్గొన్నారు. 

 నైతికంగా ఓటమిని ఒప్పుకున్నట్లే..

రాహుల్ గాంధీ కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో పర్యటించి, కనీసం ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించలేదని, నైతికంగా ఆ పార్టీ ఓటమిని ఒప్పుకున్నట్లేనని బీఆర్ఎస్ సిటీ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్ అన్నారు. శుక్రవారం  రామ్‌‌‌‌నగర్ లోని  మీసేవ ఆఫీస్‌‌‌‌లో మీడియాతో మాట్లాడారు.