
హైదరాబాద్ సిటీ, వెలుగు: లోతట్టు ప్రాంతాల్లో వరద ముంపు లేకుండా చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. ఇటీవల కురిసిన వర్షాలకు చార్మినార్ జోన్ సంతోష్ నగర్ సర్కిల్ లో ముంపునకు గురైన ప్రాంతాలను బుధవారం యాకుత్ పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మిరాజ్ తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. లోతట్టు ప్రాంతాల్లో వరద ముంపు నివారణకు చర్యలు తీసుకోవాలని మెయింటెనెన్స్ సీఈని ఆదేశించారు. వరద నీటి ప్రవాహాన్ని నియంత్రించడానికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మరోసారి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కమిషనర్ వెంట జోనల్ కమిషనర్ వెంకన్న, జోనల్ ఎస్ఈ మహేశ్వర్ రెడ్డి, డీసీ మంగతాయారు, సీఈ సహదేవ్ రత్నాకర్, ప్రాజెక్టు ఈఈ శ్రీనివాస్ పాల్గొన్నారు.