బీఆర్ఎస్‌లో చేరిన తిరుపతిరెడ్డి

బీఆర్ఎస్‌లో చేరిన తిరుపతిరెడ్డి

మెదక్​, వెలుగు: కాంగ్రెస్​ టికెట్​ రాలేదన్న ఆవేదనతో ఇటీవల రాజీనామా చేసిన మెదక్ డీసీసీ  ప్రెసిడెంట్​ కంఠారెడ్డి తిరుపతిరెడ్డి శుక్రవారం బీఆర్​ఎస్​ లో చేరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్​ కేటీఆర్​ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. పద్మా దేవేందర్ రెడ్డి గెలుపుకోసం చిత్తశుద్ధితో కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్​ చైర్​ పర్సన్​ సునీతారెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.