మెదక్​ పట్టనంలో సబ్​ జూనియర్ అథ్లెటిక్స్​ ఎంపిక పోటీలు

మెదక్​ పట్టనంలో సబ్​ జూనియర్ అథ్లెటిక్స్​ ఎంపిక పోటీలు

మెదక్​ టౌన్, వెలుగు: స్టేట్​సబ్​ జూనియర్​ అథ్లెటిక్స్​చాంపియన్​షిప్​-2025, అండర్​ 8, 10, 12  బాలబాలికల ఎంపిక శనివారం మెదక్​ పట్టనంలోని అథ్లెటిక్​ స్టేడియంలో నిర్వహించారు. జిల్లా నుంచి150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. మూడు విభాగాల్లో ఎంపికలు జరిగాయి. కార్యక్రమానికి డాక్టర్​ సూఫీ హాజరై విజేతలకు బహుమతి ప్రదానం చేసి మాట్లాడారు.  శారీరకంగా, మానసికంగా క్రీడలు ఎంతో దోహద పడతాయని, గెలుపోటములను సమానంగా స్వీకరించాలని తెలిపారు. 

వివిధ క్రీడల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు జూన్ 1న హైదరాబాద్​లోని జింఖానా గ్రౌండ్​లో రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. కార్యక్రమంలో మెదక్ డిస్టిక్ అథ్లెటిక్స్ అసోసియేషన్ మధుసూదన్, జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ మహేందర్ రెడ్డి, నరేశ్, పీడీ చంటి, పీఈటీ అర్జున్, క్రీడాకారులు పాల్గొన్నారు.