
కౌడిపల్లి/చిలప్ చెడ్, వెలుగు: రాష్ట్ర కార్మిక, గనులు, ఉపాధి కల్పన శాఖ మంత్రిగా బుధవారం బాధ్యతలు స్వీకరించిన గడ్డం వివేక్ వెంకటస్వామిని మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనను శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. చిలప్ చెడ్ మాజీ జడ్పీటీసీ చిలుముల శేషసాయిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు చంద్రం కృష్ణ గౌడ్, చిరంజీవి, సావిత్రి రెడ్డి, సోహెల్, కిశోర్ గౌడ్ తదితరులున్నారు.
మంత్రిని కలిసిన కాంగ్రెస్ నేతలు..
సిద్దిపేట టౌన్, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్వెంకటస్వామి రాష్ట్ర మైనింగ్, కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రిగా బుధవారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణ, దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి ఆయనను శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మంత్రి సూచించినట్లు తెలిపారు.
ఐఎన్టీయూసీ నాయకులు..
రామచంద్రాపురం, వెలుగు: రాష్ట్ర కార్మిక, గనులు, ఉపాధి కల్పన శాఖ మంత్రిగా బుధవారం బాధ్యతలు స్వీకరించిన ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్వెంకటస్వామిని సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా అధ్యక్షుడు కొల్కూరి నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఆయనను సన్మానించి, పారిశ్రామిక వాడలోని పలు సమస్యలను వివరించారు. పరిశ్రమల్లో పని చేస్తున్న సంఘటిత, అసంఘటిత కార్మికుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.
వారికి మెరుగైన వైద్య సదుపాయాలు, ఉద్యోగ భద్రత కల్పించి, మంచి వేతనం అందేలా చూడాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో భవన నిర్మాణ రంగంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విన్నివించారు. జిల్లా ఉపాధ్యక్షుడు రాజేందర్ రెడ్డి, సెక్రటరీ సుందర్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రికి శుభాకాంక్షలు..
జహీరాబాద్, వెలుగు: రాష్ట్ర కార్మిక, గనులు, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని బుధవారం సెక్రటేరియట్లోని ఆయన చాంబర్లో రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రిని సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.