V6 News

ఫోన్లు పోతే సీఈఐఆర్ పోర్టల్ లో ఫిర్యాదు చేయాలి : ఎస్పీ డీవీ శ్రీనివాస్రావు

ఫోన్లు పోతే సీఈఐఆర్ పోర్టల్ లో ఫిర్యాదు చేయాలి : ఎస్పీ డీవీ శ్రీనివాస్రావు
  •     ఎస్పీ డీవీ శ్రీనివాస్​రావు

మెదక్​టౌన్, వెలుగు: ఫోన్లు పోగొట్టుకున్నా, చోరీకి గురైనా వెంటనే సీఈఐఆర్​ పోర్టల్​లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ డీవీ శ్రీనివాస్​రావు సూచించారు.  సోమవారం రూ.15 లక్షల విలువైన 110 సెల్​ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఫోన్ పోయినప్పుడు  ప్రజలు ఆందోళన చెందకుండా సంబంధిత పీఎస్​లో ఫిర్యాదు చేసి సీఈఐఆర్​ పోర్టల్ లో వివరాలను నమోదు చేయించాలని సూచించారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు మొత్తం 1,734 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని బాధితులకు అందించామని తెలిపారు. 

సీఈఐఆర్​ పోర్టల్ సాయంతో పోయిన ఫోన్లను గుర్తించడం చాలా సులభమని, ప్రతి ఒక్కరూ దీనిని వినియోగించుకోవాలని పేర్కొన్నారు.  ప్రతి పీఎస్​లో సీఈఐఆర్​ కోసం ప్రత్యేకంగా అధికారులను నియమించి శిక్షణ ఇచ్చామన్నారు. దొంగిలించిన ఫోన్లు నేరాలకు ఉపయోగించే అవకాశం ఉన్నందున సీఈఐఆర్​లో నమోదు చేయడం తప్పనిసరి అని సూచించారు. 

మొబైల్స్ రికవరీలో నైపుణ్యం ప్రదర్శించిన ఐటీ కోర్ టీమ్‌‌‌‌ కానిస్టేబుల్స్ విజయ్, వెంకట్ గౌడ్, మహేందర్ గౌడ్, వివిధ పీఎస్​లలో ప్రతిభ చూపిన సిబ్బందికి ఎస్పీ ప్రశంసా పత్రాలను అందచేసి రివార్డు ప్రకటించారు. కార్యక్రమంలో ఏఎస్పీ మహేందర్, ఇన్​స్పెక్టర్​కృష్ణమూర్తి, ఐటీ కోర్, సీఈఐఆర్​ పోర్టల్ సిబ్బంది పాల్గొన్నారు.