మేడారం జాతరలో చివరి ఘట్టం.. వన ప్రవేశం చేసిన సమ్మక్క ,సారలమ్మ

మేడారం జాతరలో చివరి ఘట్టం..  వన ప్రవేశం చేసిన సమ్మక్క ,సారలమ్మ

నాలుగు రోజుల పాటు మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతర  ముగియనుంది. చివరి పూజల అనంతరం వన దేవతలు తిరిగి అడవికి వెళ్లారు. చిలకలగుట్టకు సమ్మక్క, కన్నెపల్లికి సారలమ్మ బయలుదేరారు.  పునుగొండ్లకు పగిడిద్దరాజు, కొండాయికి గోవిందరాజు వెళ్లనున్నారు. జాతర చివరి అంకానికి చేరడంతో మేడారం జనసంద్రమైంది. కాగా, మరోవైపు మేడారం జాతర గ్రాండ్ సక్సెస్ అయింది. కనీవినీ ఎరుగని రీతిలో ఈ సారి జాతరలో భక్తులు పాల్గొన్నారు. ఒకప్పుడు గిరిజనులు మాత్రమే జరుపుకునే ఈ జాతరను.. ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ విశేషంగా జరుపుకుంటున్నారు.

శుక్రవారం ( ఫిబ్రవరి 23)  ఒక్కరోజే ఏకంగా 50 లక్షల మంది భక్తులు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్నారని అధికారులు వెల్లడించారు. ఈ జాతరకు ప్రభుత్వం భారీ ఏర్పాటు చేసింది. శుక్రవారం గవర్నర్ తమిళి సైతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవార్లను దర్శించుకున్నారు. మరోవైపు భక్తులు పెద్ద సంఖ్యలో ఇంటికి తిరుగుముఖం పట్టడంతో మేడారం - తాడ్వాయి రోడ్డుపైన వాహనాల రద్దీ నెలకొంది. శనివారం ( ఫిబ్రవరి 24)  కూడా అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులు భారీగా వచ్చారు. 

ఇవాళ ( ఫిబ్రవరి 24)  జాతరలో చివరి ఘట్టమైన అమ్మవార్లు వన ప్రవేశం చేయడంతో జాతర ముగియనుంది. ఇప్పటికే సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న భక్తులు మేడారం నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఇంటికి తిరుగుముఖం పట్టడంతో మేడారం తాడ్వాయి రోడ్డుపైన వాహనాల రద్దీ నెలకొంది. దీంతో ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తుతుంది. ఇక నేడు కూడా మేడారం జాతరలో అమ్మవార్లను దర్శించుకోవడానికి వెళ్లేవారి సంఖ్య భారీగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.  ఏది ఏమైనా మేడారం జాతర నేటితో ముగియనున్న క్రమంలో మళ్లీ రెండేళ్లకు వచ్చే మేడారం జాతరకు అంతా బాగుంటే వస్తామని ఆ తల్లులకు నివేదించుకుని, మొక్కులు చెల్లించుకుని అమ్మలను దర్శించుకున్న భక్తులు తిరుగు ప్రయాణం అవుతున్నారు