మేడారం .. 76 హుండీల ద్వారా రూ. 93 లక్షలు

మేడారం .. 76 హుండీల ద్వారా రూ. 93 లక్షలు
  • కొనసాగుతున్న మేడారం హుండీల లెక్కింపు
  • ఇప్పటివరకు 481 హుండీల్లో రూ. 11.25 కోట్ల ఇన్ కం
  • చివరి దశకొచ్చిన లెక్కింపు ప్రక్రియ

వరంగల్, వెలుగు: మేడారం మహా జాతర హుండీ ఆదాయం రూ.11.25 కోట్లకు చేరుకుంది. ఆదివారం నాటికి 405 హుండీలను లెక్కించగా మొత్తం రూ.10,32,03,000 ఆదాయం వచ్చింది. సోమవారం మరో 76 హుండీలను లెక్కించడంతో రూ. 93.67 లక్షలు వచ్చాయి. దీంతో ఇప్పటివరకు మొత్తం 481 హుండీల లెక్కింపు పూర్తి కాగా రూ. 11,25,70,000 ఇన్ కం వచ్చినట్లు ఆఫీసర్లు చెప్పారు. తిరుగువారం కోసం ఉంచిన 22 హుండీలు సైతం సోమవారం హనుమకొండలోని టీటీడీకి చేరుకున్నాయి. మొత్తం ఆదాయాన్ని డిపార్ట్ మెంట్ బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేసినట్లు అసిస్టెంట్‍ కమిషనర్‍ రామల సునీత, మేడారం ఈవో రాజేంద్రం తెలిపారు. మేడారం హుండీల లెక్కింపు చివరి దశకు చేరుకుంది. మొత్తం 540 హుండీలను ఏర్పాటు చేయగా ఇంకా59 హుండీలను లెక్కించాల్సి ఉంది.