210 కిలోల గంజాయి పట్టివేత.. ఒకరి అరెస్ట్

210 కిలోల గంజాయి పట్టివేత.. ఒకరి అరెస్ట్

హైదరాబాద్ లో గంజాయి అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతోంది. అక్రమార్కులు యువతే ప్రధాన టార్గెట్ గా గంజాయి చేరవేస్తున్నారు. నిత్యం ఏదో ఒక చోట గంజాయి పట్టుబడుతూనే ఉంది. 

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో గుట్టు చప్పుడు కాకుండా గంజాయి అమ్ముతున్న స్థావరాలపై ఎస్. ఓ. టి పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 210 కిలోల గంజాయి, ఒక కియా కారు, ఒక సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ. 60 లక్షలకుపైగా ఉంటుందని డీసీపీ సందీప్ రావు తెలిపారు. అక్రమంగా కారులో గంజాయిని తరలిస్తున్న నిందితుడు తిరుపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.