
స్టేషన్ ఘనపూర్, వెలుగు: హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ రాష్ట్రంలో 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిన వారితో ఆదివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కార్యక్రమంలో జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి సింగపురం ఇందిర హాజరయ్యారు.
ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ తో ఆమె భేటీ అయ్యారు. నియోజక వర్గంలోని తాజా పరిస్థితులపై వివరించారు. మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించామని, అన్నీ గమనిస్తున్నామని చెప్పారు. అధైర్య పడొద్దని, అండగా ఉంటామని ఇందిరకు ఆమె హామీ ఇచ్చారు.