
హైదరాబాద్, వెలుగు : తెలంగాణ నుంచి 17,000 మంది సెల్లర్లు తమ ప్లాట్ఫామ్లో రిజిస్టర్ చేసుకున్నారని ఈ–కామర్స్ కంపెనీ మీషో ప్రకటించింది. జీరో కమిషన్ వంటి ఇనీషియేటివ్స్ను తీసుకురావడంతో రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈలు తమ ప్లాట్ఫామ్లో జాయిన్ కావడం 20 శాతం పెరిగిందని వెల్లడించింది. రాష్ట్రంలోని 200 మంది సెల్లర్లు లక్షాధికారులు అయ్యారని పేర్కొంది. ఉమెన్ క్లాత్స్, కిడ్స్వేర్, వెల్నెస్ కన్జూమర్ ప్రొడక్ట్లను కిందటేడాది మీషో నుంచి ఎక్కువగా ఆర్డర్ పెట్టారని కంపెనీ డైరెక్టర్ ఉత్కర్ష్ గార్గ్ అన్నారు.
కిందటేడాది దేశం మొత్తం మీద తమ ప్లాట్ఫామ్లో 90 కోట్ల ఆర్డర్ ట్రాన్సాక్షన్లు జరగగా, ఇందులో 3.3 కోట్ల ట్రాన్సాక్షన్లు తెలంగాణ నుంచే ఉన్నాయని వివరించారు. 50 శాతం మంది తమ సెల్లర్లు టైర్ 2, టైర్ 3 సిటీల నుంచే ఉన్నారని పేర్కొన్నారు. ప్రైవేట్ లేబుల్స్తో ప్రొడక్ట్లను అమ్మడం లేదని, సెల్లర్ల నుంచి కమిషన్ తీసుకోవడం లేదని మీషో వివరించింది. ఏర్పడిన 8 ఏళ్లలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఈ–కామర్స్ కంపెనీగా తాము నిలిచామని తెలిపింది.