
మెగాస్టార్ స్పీడు మామూలుగా లేదు. వరుస సినిమాలకు కమిటవ్వడమే కాదు.. వాటిని కంప్లీట్ చేయడంలోనూ తన జోరు చూపిస్తున్నారు. రీసెంట్గా ‘గాడ్ఫాదర్’గా వచ్చిన చిరంజీవి.. నెక్స్ట్ ‘వాల్తేరు వీరయ్య’గా రానున్నారు. బాబి డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. యాక్షన్ సీక్వెన్సులు తీస్తున్నారు. మరోవైపు నిన్నటి నుంచి డబ్బింగ్ కూడా మొదలుపెట్టేశారు. ఈ విషయాన్ని దర్శక నిర్మాతలు స్వయంగా కన్ఫర్మ్ చేశారు. అది మాత్రమే కాదు.. దీపావళి కానుకగా టీజర్ని కూడా వదలబోతున్నారు.
ఆ విషయమై దేవిశ్రీ ప్రసాద్ ట్వీట్ చేస్తూ.. ‘బాబీ సర్కి అభినందనలు. మీ కల నిజం కాబోతోంది. దీపావళికి బాస్ ఎక్సయిటింగ్ టీజర్ వస్తోంది. నేను బ్యాగ్రౌండ్ స్కోర్ పూర్తి చేసేశాను. మీ అందరితో కలిసి మెగా మాస్ ఎంటర్టైనర్ను థియేటర్లో చూడటానికి సంక్రాంతి వరకు ఆగలేకపోతున్నాను’ అంటూ తన ఎక్సయిట్మెంట్ను షేర్ చేసుకున్నాడు. శ్రుతీ హాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తుండటంతో విపరీతమైన బజ్ ఉంది. మరోవైపు మెహర్ రమేష్ డైరెక్షన్లో ‘భోళాశంకర్’ కూ