
గోదావరిఖని, వెలుగు: గోదావరిఖని సింగరేణి జేఎన్స్టేడియంలో ఈ నెల 18న నిర్వహించనున్న మెగా జాబ్మేళా నిరుద్యోగులకు సువర్ణావకాశమని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ తెలిపారు. గురువారం క్యాంప్ ఆఫీస్లో జాబ్మేళా పోస్టర్ను సింగరేణి జీఎంలు డి.లలిత్ కుమార్, బి.వెంకటయ్య, ఏసీపీ ఎం.రమేశ్తో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోబెల్ ఎడ్యుకేషనల్ ఎంప్లాయిమెంట్ అసోసియేషన్, సింగరేణీ కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్మేళాలో 100 కంపెనీలు పాల్గొంటున్నాయని, సుమారు మూడు వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో సింగరేణి ఆఫీసర్లు కిరణ్బాబు, కుమారస్వామి, వరప్రసాద్, వీరారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. .