సింగిల్ ఫ్రేమ్‌లో టాప్ స్టార్స్..అదిరిపోయిన ఫెస్టివల్ ట్రీట్

సింగిల్ ఫ్రేమ్‌లో టాప్ స్టార్స్..అదిరిపోయిన ఫెస్టివల్ ట్రీట్

టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్స్ దీపావళి ఫెస్టివల్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

లేటెస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన( Upasana) దంపతులు తమ ఇంట్లో దీపావళి ఫెస్టివల్ ను నిన్న (నవంబర్ 11న) రాత్రి గ్రాండ్ గా స్టార్స్ కపుల్స్ తో సెలబ్రేట్ చేసుకున్నారు. 

మెగా పార్టీ ఇచ్చిన ఈ విందుకు..టాలీవుడ్ లోని టాప్ హీరోస్ ఫ్యామిలీస్ తో పాటు పలువురు సెలబ్రిటీలు వచ్చారు. మహేష్ – నమ్రత దంపతులు, ఎన్టీఆర్-ప్రణతి, వెంకటేష్,సుధీర్ బాబు ఫ్యామిలీతో పాటు మంచు లక్ష్మి సందడి చేశారు. ఈ మెగా పార్టీ ఫొటోస్ ను మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ (Namrata Shirodkar) తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం స్టార్స్ సందడి చేసిన పార్టీ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

ఈ షేర్ చేసిన ఫొటోస్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్, వెంకీ మామ, మహేష్ బాబు అందరు కలిసి ఒకే ఫ్రేమ్ లో ఉండటంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. అలాగే ఉపాసన, నమ్రత, ప్రణతి జంటగా దిగిన ఫోటోలు కూడా వైరల్ గా మారడంతో..తమ అభిమాన ఫ్యామిలీ ఫొటోస్ తో..దీపావళి ట్రీట్ అదిరిపోయిందంటూ..టాలీవుడ్ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.