దేశంలో రెండో అత్యన్నత పౌరపురస్కారం పద్మవిభూషణ్ లభించినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. పద్మవిభూషణ్ అవార్డు వచ్చిందని తెలిసిన క్షణం ఏం మాట్లాడాలో, ఎలా స్పందించాలో తెలియని పరిస్థితిలో ఉన్నానని చెప్పారు. ఒక తల్లికడుపున పుట్టకపోయినా, తనను తమ సొంతమనిషిగా, అన్నయ్యగా, బిడ్డగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, సినీ కుటుంబం అండదండలు, నీడలా తనతో ప్రతినిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగానే తాను ఈ స్థితిలో ఉన్నానని తెలిపారు.
తనకు దక్కినటువంటి ఈ గౌరవం ప్రజలందరిదని చిరంజీవి చెప్పారు. తనపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలకు తాను ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో తెలియడం లేదని అన్నారు. తన 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో వెండితెరపై వైవిధ్యమైన పాత్రల ద్వారా వినోదం పంచడానికి శక్తిమేరకు ప్రయత్నిస్తూనే ఉన్నానని చెప్పారు. నిజజీవితంలో కూడా తన చుట్టూ ఉన్న సమాజంలో అవసరమైనప్పుడు తనకు చేతనైన సాయం చేస్తూనే ఉన్నానని తెలిపారు.
??? pic.twitter.com/4PDaCV2kzv
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 25, 2024
కానీ తనపై చూపిస్తున్న కొండంత అభిమానానికి ప్రతిగా ఇస్తున్నది గోరంతే అని అన్నారు. ఈ నిజం నాకు ప్రతిక్షణం గుర్తుకువస్తూనే ఉంటుందని చెప్పారు. తనను బాధ్యతగా ముందుకు నడిపిస్తుంటుందని తెలిపారు. తనను ఈ ప్రతిష్ఠాత్మకమైన పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీ గారికి తనా హృదయపూర్వక కృతజ్ఞతలు అని చిరంజీవి తెలిపారు.