కుర్ర డైరెక్టర్స్ తో మెగాస్టార్.. రెండూ పాన్ ఇండియా సినిమాలే

కుర్ర డైరెక్టర్స్ తో మెగాస్టార్.. రెండూ పాన్ ఇండియా సినిమాలే

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత మెగాస్టార్ నుండి వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. తమిళ హిట్ సినిమా వేదలం రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో.. తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ లాంటి టాప్ యాక్టర్స్ నటిస్తున్నారు.

అయితే.. ఈ సినిమా తరువాత చిరు చేయబోయే ప్రాజెక్ట్స్ పై క్రేజీ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. చిరు తన తరువాత సినిమాల కోసం కుర్ర డైరెక్టర్స్ ని లైన్లో పెడుతున్నాడట. అందులో ముందుగా.. సోగ్గాడే చిన్నినాయన ఫేమ్ కళ్యాణ్ కృషతో మూవీ చేయనున్నాడట. ఈ దర్శకుడు చెప్పిన సోషియో ఫాంటసీ కథకి ఒకే చెప్పేసాడట చిరు. నిజానికి మెగాస్టార్ కూడా చాలా రోజుల నుండి ఒక సోషియో ఫాంటసీ మూవీ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. అదే సమయంలో కళ్యాణ్ కృష చెప్పిన కథ చిరుకి బలే నచ్చేసిందట. అందుకే వెంటనే ఒకే చెప్పేశాడాని సమాచారం. చిరంజీవి కూతురు సుస్మిత నిర్మిస్తున్న ఈ సినిమా.. సెప్టెంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది.

ఈ మూవీ తరువాత.. చిరు బింబిసారతో భారీ హిట్ అందుకున్న డైరెక్టర్ వశిష్టతో సినిమా ప్లాన్ చేస్తున్నాడట. ఇది కూడా బింబిసారాలాగే పీరియాడికల మూవీగా రానుందట. పాన్ ఇండియా రేంజ్ లో రానున్న ఈ సినిమా కోసం నిర్మాతలు భారీగానే ఖర్చు చేస్తున్నారని సమాచారం. ఛలో, భీష్మ సినిమాల ఫేమ్ వెంకీ కుడుములతో కూడా ఒక మూవీ ప్లాన్ చేశాడు చిరు. ఆఫీషియాల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కానీ ఎందుకో ఈ సినిమా ఆగిపోయింది. మరి యంగ్ డైరెక్టర్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న  చిరు.. ఎలాంటి హిట్స్ సొంతం చేసుకుంటాడో చూడాలి మరి.