Chiranjeevi: ధనుష్ మాత్రమే బిచ్చగాడి పాత్ర చేయగలడు.. నేషనల్ అవార్డ్ రాకపోతే అర్ధం లేదు

Chiranjeevi: ధనుష్ మాత్రమే బిచ్చగాడి పాత్ర చేయగలడు.. నేషనల్ అవార్డ్ రాకపోతే అర్ధం లేదు

కుబేర మూవీ సక్సెస్ మీట్ ఆదివారం రాత్రి (జూన్22న) వైభవంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా వచ్చి తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా సినిమాలోని ప్రతి నటుడి గురించి చిరు గొప్పగా మాట్లాడారు. ముఖ్యంగా ధనుష్ అసాధారణ నటనను మెచ్చుకుంటూ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించాడు. 

చిరు మాటల్లో.. ‘దేవ క్యారెక్టర్‌లో ధనుష్‌ని తప్ప ఇంకెవరిని ఊహించుకోలేం. దేవా పాత్రను చేయడానికి ఇండియాలో ధనుష్ తప్ప ఇంకెవరూ లేరు, చేయలేరు కూడా. సినిమా చూస్తున్నప్పుడు ధనుష్‌ని గుర్తించలేకపోయాను. అంతలా క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్ అయి దేవా పాత్రకు ప్రాణం పోశాడు. నేషనల్ అవార్డ్స్ తనకు మామూలు అయిపోయాయి.. కానీ, మరోసారి కూడా బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తుంది. రాకపోతే నేషనల్ అవార్డ్స్ కి అర్ధం లేదని’ చిరంజీవి వెల్లడించారు.

డైరెక్టర్ శేఖర్ కమ్ముల 25 ఏళ్ల సినీ ప్రస్థానం గురించి చిరు మాట్లాడుతూ.. ‘శేఖర్.. తన ఒక్కొక్క మూవీని ఆణిముత్యం చెక్కుతూ.. సినీ ప్రేక్షకుల గుండెల్లో ఒక సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. నా స్టేట్ రౌడీ షూటింగ్ జరుగుతున్నప్పుడు శేఖర్ కమ్ముల నన్ను ఓ అభిమానిలా కలిశారు. ఆరోజే సినిమా ఇండస్ట్రీలో స్థిరపడిపోవాలని డిసైడ్ అయ్యాడు. ఇవాళ ఇలాంటి ఆణిముత్యాలు లాంటి సినిమాలు తీసి ప్రేక్షకుల మన్ననలని పొందుతున్న దర్శకుడిగా ఆయన ఉండడం.. ఎంతో గర్వంగా ఉందని’చిరు అన్నారు. జూన్ 20న థియేటర్లలో విడుదలైన కుబేర బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు కనబరుస్తుంది.