అమెరికా అధ్యక్షడు ట్రంప్ భార్య, అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ ఢిల్లీలో బిజిబిజీగా గడుపుతున్నారు. ఢిల్లీలోని సర్వోదయ కో ఎడ్యుకేషన్ సీనియర్ సెకండరీ స్కూల్ ను మెలానియా సందర్శించారు. అక్కడ మెలానియాకు స్కూల్ సిబ్బంది, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. హారతి పట్టి నుదుటిన బొట్టు పెట్టి మెలానియాకు చిన్నారులు స్వాగతం పలికారు. కొద్దిసేపు విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం క్లాస్ రూమ్ కు వెళ్లిన మెలానియా కాసేపు విద్యార్థులతో మాట్లాడారు. గంట సేపు స్కూల్లోనే గడపనున్నారు మెలానియా.
see more news
మహాత్ముడికి నివాళి అర్పించి..మొక్కను నాటిన ట్రంప్ దంపతులు
రాష్ట్రపతి భవన్ లో ట్రంప్ కు గ్రాండ్ వెల్ కమ్
Delhi: First Lady of the US, Melania Trump meets and interacts with students at Sarvodaya Co-Ed Senior Secondary School. pic.twitter.com/OGKPgr70IL
— ANI (@ANI) February 25, 2020