పద్మారావునగర్, వెలుగు: కరోనా పేషెంట్లకు ట్రీట్ మెంట్ చేస్తూ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయిన గాంధీ ఆస్పత్రి మెడికల్ స్టాఫ్, వాళ్ల కుటుంబసభ్యుల త్యాగం చరిత్రలో నిలిచిపోతుందని డీఎంఈ రమేశ్ రెడ్డి అన్నారు. వాళ్ల జ్ఞాపకార్థం గాంధీ మెడికల్ కాలేజీ ఆవరణలో మెమోరియల్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసు నమోదై రెండేండ్లయిన సందర్భంగా బుధవారం గాంధీ ఆలమ్ని బిల్డింగ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరోనాతో చనిపోయినోళ్లకు నివాళి అర్పించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. కరోనా టైమ్ లో డాక్టర్లు, మెడికల్ స్టాఫ్అందించిన సేవలు మరిచిపోలేనివని రమేశ్ రెడ్డి అన్నారు. మీడియా, పోలీస్ సిబ్బంది సేవలనూ ప్రశంసించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 85 వేల మంది కరోనా పేషెంట్లకు ట్రీట్ మెంట్, 6 వేల మంది పాజిటివ్గర్భిణులకు డెలివరీలు, 5 వేల మంది కరోనా పేషెంట్లకు డయాలసిస్, 1500 మంది బ్లాక్ఫంగస్ పేషెంట్లకు ట్రీట్ మెంట్ అందజేసిన ఘనత గాంధీ ఆస్పత్రిదేనని కొనియాడారు. అలాగే 650కి పైగా ఐసీయూ బెడ్లలో పేషెంట్లకు ట్రీట్ మెంట్ అందించడం సాధారణ విషయం కాదన్నారు. ఇదంతా గాంధీ మెడికల్ స్టాఫ్ వల్లే సాధ్యమైందన్నారు. ఈ సందర్భంగా డాక్టర్లు, మెడికల్ స్టాఫ్ కు ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు కృతజ్ఞతలు తెలిపారు. డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్ నర్సింహారావు, డాక్టర్ శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు.
కరోనాతో చనిపోయిన గాంధీ స్టాఫ్కు మెమోరియల్
- తెలంగాణం
- March 3, 2022
లేటెస్ట్
- కాంగ్రెస్లో నయా జోష్.. మండుటెండలో జన జాతర సక్సెస్
- రోహిత్ వేముల కేసులో సమగ్ర దర్యాప్తు
- అదానీ, అంబానీ కోసమే మోదీ.. ఏటా 3 కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి మోసం చేసిండు: వివేక్ వెంకటస్వామి
- ప్రజా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్రలు: సీఎం రేవంత్రెడ్డి
- నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ .. నిర్మల్, అలంపూర్ సభలు
- లోక్సభ ఎన్నికల్లో యువత ఓట్లే కీలకం
- మరో రోహిత్ వేముల అయితనన్న భయంతోనే.. ఊరెళ్లి వ్యవసాయం చేస్కుంటున్న! : వేల్పుల సుంకన్న
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- గెలుపు కోసం బీఆర్ఎస్ మెజార్టీపై కాంగ్రెస్ ఫోకస్
- ఎంపీ ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్లోకి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు : మంత్రి ఉత్తమ్
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు