లోన్ రికవరీకి వెళ్లి వస్తుండగా..మెప్మా రీసోర్స్ పర్సన్పై దాడి,తీవ్రగాయాలు

లోన్ రికవరీకి వెళ్లి వస్తుండగా..మెప్మా రీసోర్స్ పర్సన్పై దాడి,తీవ్రగాయాలు

కామారరెడ్డి జిల్లాలో మెపామ రీసోర్స్​పర్సన్​ పై దాడి కలకలం రేపింది. లోన్​ రికవరీ కి వెళ్లి వస్తుండగా దాడి చేసి గాయపర్చారు. తీవ్రంగా గాయపడిన మెప్మా రికవరీ పర్సన్​ ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. రుణం తీసుకున్న వారే ఆమెపై దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. కామారెడ్డి జిల్లా కేంద్రం పరిధిలోని  అడ్డూరు గ్రామంలో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే. 

 కామారెడ్డి  మున్సిపాలిటినీ పరిధిలోని అడ్లూరులో మెప్మా రీసోర్స్​ పర్సన్ చంద్రకళపై గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం(జనవరి30 ) రాత్రి దాడిచేశారు.  గాయపడిన చంద్రకళను చికిత్సకోసం జిల్లా కేంద్రంలోని ప్రైవేట్​ ఆస్పత్రికి తరలించారు.

శుక్రవారం రాత్రి  ఓ లోన్​ రికవరీ విషయంలో  అడ్లూరులోని  రుణం తీసుకున్న వారి ఇంటికి బ్యాంకు మేనేజర్ తో కలిసి చంద్రకళ వెళ్లిన తర్వాత ఈ ఘటన జరిగింది.రికవరీకి సంబంధించిన అడిగిన తర్వాత మేనేజర్ తో కలిసి బైక్​ వెళ్తున్న చంద్రకళపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. 

అయితే రుణం తీసుకున్న వారే ఈ దాడికి పాల్పడినట్ల చంద్ర కళ కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. చంద్ర కళ భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు దేవుని పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు చంద్రకళపై దాడిని మెప్మా రీసోర్స్​ పర్సన్లు తీవ్రంగా  ఖండించారు. మెప్మా రీసోర్స్​ పర్సన్లకు భద్రత కల్పించాలని ఆందోళనకు దిగారు.