
హైదరాబాద్, వెలుగు: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) నాలుగో సీజన్లో ముంబై మీటియర్స్ నాలుగో విజయం అందుకుంది. మంగళవారం హోరాహోరీగా జరిగిన మ్యాచ్లో ముంబై 3–2 (15-–7, 7-–15, 13-–15, 15–-8, 15-–11)తో కొచ్చి బ్లూ స్పైకర్స్పై ఉత్కంఠ విజయం సాధించింది.
తొలి నాలుగు సెట్లలో కొచ్చి, ముంబై చెరో రెండు నెగ్గి సమంగా నిలవగా.. నిర్ణయాత్మక ఐదో సెట్లో ఆధిపత్యం చూపించిన మీటియర్స్ సెమీస్ బెర్త్కు చేరువైంది. ఆ టీమ్ ఆటగాడు కార్తీక్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. మరో మ్యాచ్లో గోవా గార్డియన్స్ 3–0 (15–-11, 15–-8, 15–-6)తో కోల్కతా థండర్బోల్ట్స్పై గెలిచింది.