ప్రైమ్‌‌‌‌ వాలీబాల్‌‌‌‌ లీగ్‌‎లో మీటియర్స్, గార్డియన్స్ గెలుపు

 ప్రైమ్‌‌‌‌ వాలీబాల్‌‌‌‌ లీగ్‌‎లో మీటియర్స్, గార్డియన్స్ గెలుపు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ప్రైమ్‌‌‌‌ వాలీబాల్‌‌‌‌ లీగ్‌‌‌‌ (పీవీఎల్‌‌‌‌) నాలుగో సీజన్‌‌‌‌లో ముంబై మీటియర్స్‌‌‌‌  నాలుగో విజయం అందుకుంది. మంగళవారం హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌‌‌‌లో ముంబై 3–2 (15-–7, 7-–15, 13-–15, 15–-8, 15-–11)తో కొచ్చి బ్లూ స్పైకర్స్‌‌‌‌పై ఉత్కంఠ విజయం సాధించింది. 

తొలి నాలుగు సెట్లలో కొచ్చి, ముంబై  చెరో రెండు నెగ్గి సమంగా నిలవగా.. నిర్ణయాత్మక ఐదో సెట్లో ఆధిపత్యం చూపించిన మీటియర్స్‌‌‌‌ సెమీస్‌‌‌‌ బెర్త్‌‌‌‌కు చేరువైంది. ఆ టీమ్ ఆటగాడు కార్తీక్‌‌‌‌ ‘ప్లేయర్ ఆఫ్‌‌‌‌ ది మ్యాచ్‌‌‌‌’గా నిలిచాడు. మరో మ్యాచ్‌‌‌‌లో గోవా గార్డియన్స్ 3–0 (15–-11, 15–-8, 15–-6)తో   కోల్‌‌‌‌కతా థండర్‌‌‌‌బోల్ట్స్‌‌‌‌పై   గెలిచింది.