
మెట్పల్లి, వెలుగు: ఎన్హెచ్ 63పై ఏర్పడిన గుంతలను మెట్పల్లి పోలీసులు పూడ్చారు. ఆరపేట నుంచి డిపో సర్కిల్ వరకు గతేడాది కురిసిన వానలతో గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులు పలుమార్లు ప్రమాదాలకు గురవుతున్నారు. దీనిపై వాహనదారులు, స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.
గురువారం మెట్పల్లి పోలీసులు ముందుకు వచ్చారు. సీఐ అనిల్, ఎస్సై కిరణ్ కుమార్ తమ సొంత ఖర్చులతో ఆరపేట నుంచి డిపో సర్కిల్ వరకు రెడీ మిక్స్ ద్వారా సిమెంట్ కాంక్రీట్తో పూడ్చారు.