హైదరాబాద్, వెలుగు: చెప్పులు, షూస్ అమ్మే మెట్రో బ్రాండ్స్ ఈ నెల 10 న ఇన్వెస్టర్ల ముందుకొస్తోంది. కంపెనీ ఐపీఓ 10 న ఓపెన్ అయి, 14 న ముగుస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ఈ నెల 9 న అందుబాటులో ఉంటుంది. షేరు ధర రూ. 485–500 గా నిర్ణయించారు. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 1,368 కోట్లను సేకరించాలని మెట్రో బ్రాండ్స్ చూస్తోంది.
రూ. 295 కోట్ల విలువైన షేర్లను ఫ్రెష్గా ఇష్యూ చేయనుండగా, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 2.14 కోట్ల షేర్లను అమ్ముతారు. ఐపీఓ ద్వారా కంపెనీ ప్రమోటర్లు 10 శాతం వాటాను సేల్ చేయనున్నారు. ప్రస్తుతం దేశంలోని 136 సిటీలలో 598 స్టోర్లను మెట్రోబ్రాండ్స్ ఆపరేట్ చేస్తోంది. ఇందులో 211 స్టోర్లను గత మూడేళ్లలోనే ఏర్పాటు చేయడం గమనించాలి. ఇన్వెస్టర్లు కనీసం 30 షేర్ల కోసం బిడ్స్ వేయాలి.