హైదరాబాద్ : సిటీ వాసులకు మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. లాక్ డౌన్ నుంచి రైలు టైమింగ్స్ ను మార్చిన మెట్రో అధికారులు.. రేపట్నుంచి పాత టైమింగ్సే అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. దీంతో ఉదయం 6 గంటలకే ఫస్ట్ మెట్రో రైలు ప్రారంభంకాగా.. రాత్రి 10:15 గంటలకు చివరి స్టేషన్ నుంచి మెట్రో రైలు బయల్దేరనుందన్నారు. చివరి రైలు గమ్యస్థానానికి 11:15 గంటలకు చేరుకోనుందని తెలిపిన మెట్రో అధికారులు ప్రయాణికులు ఈ టైమింగ్స్ ను గమనించాలన్నారు.
ట్విట్టర్ లో మంత్రి KTR కి ప్రయాణీకులు మెట్రో టైమింగ్స్ పెంచాలనే విజ్ఞప్తి చేశారు. మంత్రి ఆదేశాలతో రైల్ వేళలు పొడిగిస్తూ L & T మెట్రో, హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థలు నిర్ణయించినట్లు ఎంవిఎస్ రెడ్డి తెలిపారు. రేపటి నుంచి మారిన మెట్రో టైమింగ్స్ అమల్లోకి వస్తాయన్నారు ఎంవిఎస్ రెడ్డి. ప్రస్తుతం ఉదయం ఏడింటికి ఫస్ట్ ట్రైన్ ప్రారంభమవుతుండగా.... చివరి ట్రైన్ రాత్రి పదింబావుకి క్లోజ్ అవుతోందన్నారు.
We are happy to announce that as desired by Mr @KTRTRS, in response to passenger requests, arrangements have been made to run trains, 6 AM onwards from tomorrow. The first trains will leave at 6 AM & the last trains will leave at 10:15 PM, reaching their destinations at 11:15 PM pic.twitter.com/3veg39wO2w
— L&T Hyderabad Metro Rail (@ltmhyd) November 9, 2021