డిసెంబర్ 19 నుంచి మహా సాంస్కృతిక వేడుక

డిసెంబర్ 19 నుంచి మహా సాంస్కృతిక వేడుక
  • ఎంఎఫ్ హుస్సేన్ కళాఖండాల ప్రదర్శన

హైదరాబాద్​సిటీ, వెలుగు: ఈ నెల 19 నుంచి 21 వరకు నానక్​రామ్​గూడలోని ఈయాన్ హైదరాబాద్​లో మహా సాంస్కృతిక వేడుక హైడ్ ఆర్ట్– 2025 మహోత్సవం జరగనుంది. దేశవ్యాప్తంగా 200 మందికి పైగా కళాకారులు ఈ వేదికలో తమ కళాఖండాలను ప్రదర్శించనున్నారు. అలాగే ఒక ప్రత్యేక ‘మాస్టర్స్ ఆఫ్ ఇండియా’ గ్యాలరీలో ఎం.ఎఫ్. హుస్సేన్, ఎస్.హెచ్. రజా వంటి ఆధునిక భారతీయ దిగ్గజాల అరుదైన కళాఖండాలు ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.