
ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ లవబుల్ కపుల్ ఎవరంటే అది రానా, మిహికా అనే చెప్పాలి. వీళ్ళకి పెళ్ళైమూడేళ్ళు అవుతున్నా.. ఇంకా కొత్త జంటలానే కనిపిస్తూ ఉంటారు. ఇక మిహికా సినిమాస్టార్ కాకపోయినా.. ఆమెకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ మాత్రం నెక్స్ట్ లెవల్లో ఉంది. భర్త రానా సినిమా విషయాలను, తన ఫ్యామిలీకి సబంధించిన విషయాలను అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
ఇక రానా, మిహికాలు రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట.. పెద్దలని ఒప్పించి మరీ పెళ్లి బందంతో ఒక్కటయ్యారు. కరోనా కారణంగా.. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య వీరి పెళ్లి వైభవంగా జరిగింది. ఇక తాజాగా రానా ఫ్యాన్స్ దగ్గుబాటి వారసుడి గురించి అడుగుతున్నారు. ఈమేరకు సోషల్ మీడియాలో సూటిగా ప్రశ్నలు అడిగేస్తున్నారు. ఇంకొంత మంది ఒకడుగు ముందుకేసి.. మిహికా ప్రస్తుతం ప్రగ్నెంట్ అంటూ ప్రచారం కూడా చేస్తున్నారు.
ఈ వార్తలు వైరల్ అవుతున్న నేపధ్యంలో.. మిహికా స్పందించింది. అవన్నీ రూమర్స్ అని కొట్టిపారేసింది. "నేను ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. నేను పెళ్లి చేసుకుని చాలా సంతోషంగా ఉన్నాను. ఈ మధ్య బరువు పెరిగి కాస్త బొద్దుగా కనిపిస్తున్నానంతే. నిజంగా నేను ప్రెగ్నెంట్ అయితే ఆ విషయాన్ని అందరితో పంచుకుంటా అంటూ క్లారిటీ ఇచ్చింది. ఇక తనకు నటనపై ఆసక్తి లేదని స్పష్టం చేసింది". దీంతో ఆమె ప్రెగ్నెన్సీపై వస్తున్న వార్తలకు చెక్ పడింది.