ప్రత్యేక హోదాకు మా సంపూర్ణ మద్ధతు: అసదుద్దీన్‌ ఓవైసీ

ప్రత్యేక హోదాకు మా సంపూర్ణ మద్ధతు: అసదుద్దీన్‌ ఓవైసీ

ఈసారి ఎన్నికల్లో  ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు.  ప్రత్యేక హోదాకు తాము సంపూర్ణ మద్ధతు ఇస్తున్నామని హోదా సాధించేందుకు జగన్‌కు భారీ గెలుపు కట్టబెట్టాలని ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఓ రాజకీయ నిబద్ధత లేని వ్యక్తి అని, ఎన్డీఏ లో భాగస్వామిగా ఉండీ కూడా ఏపీకి ప్రత్యేక హోదా సాధించలేకపోయారని ఆయన అన్నారు. గోద్రా అల్లర్ల సమయంలో బీజేపీకి టీడీపీ మిత్రపక్షమని విమర్శించారు. ఇన్నేళ్లు ముస్లిం వర్గాల్ని దూరం పెట్టిన బాబు ఇప్పుడు డిప్యూటీ సీఎం రాగం అందుకున్నారని విమర్శించారు. ప్రజలు బాబును నమ్మటం లేదన్నారు. మరికొన్ని రోజుల్లో నరేంద్ర మోదీ మాజీ ప్రధాని కాబోతున్నారని అసద్ అన్నారు.