
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్–III పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 02.
పోస్టుల సంఖ్య: 07 (ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్–III దేవాదాయశాఖ)
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: కనిష్ట వయోపరిమితి 18 ఏండ్లు. గరిష్ట వయోపరిమితి 42 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్లు ప్రారంభం: ఆగస్టు 13.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 02.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీబీడబ్ల్యూడీఎస్, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు రూ.80. ఇతరులకు రూ.330.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు psc.ap.gov.in వెబ్సైట్లో సంప్రదించగలరు.