కోల్బెల్ట్, వెలుగు: సింగరేణి బొగ్గు గనుల్లోని పనిస్థలాల్లో పకడ్బందీ రక్షణ చర్యలు తీసుకోవాలని, డ్యూటీ టైమ్లో అప్రమత్తంగా వ్యవహరించాలని డైరెక్టర్జనరల్(మైన్స్ సేఫ్టీ) సాగేశ్ కుమార్సూచించారు. గురువారం మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా కాసిపేట-1 బొగ్గు గనిని డీడీఎంఎస్దీపక్ కుమార్, ఏరియా జీఎం ఎన్.రాధాకృష్ణ, బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ జీఎం రఘుకుమార్తో కలిసి ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా గనిలోకి దిగి పనిస్థలాల్లో కార్మికుల కల్పిస్తున్న రక్షణ చర్యలు, వసతులను తనిఖీ చేశారు. కార్మికులతో పలు అంశాలపై చర్చించారు. ప్రమాదరహిత సింగరేణిగా మార్చేందుకు అందరు కృషి చేయాలన్నారు. అనంతరం గని ఆఫీస్లోని రికార్డులను పరిశీలించారు. ఏజెంట్అబ్దుల్ ఖాదిర్, గని మేనేజర్ సతీశ్, ఏరియా ఇంజనీర్ మాధవ్, సేఫ్టీ ఆఫీసర్సురేశ్, డిప్యూటీ మేనేజర్ వెంకటేశ్, సంక్షేమ అధికారి మీర్జా గౌస్ జీషాన్ తదితరులు పాల్గొన్నారు.
