టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు సంచలన కామెంట్స్ చేశారు. పోలవరంపై చంద్రబాబు ఏనాడైనా నిజాలు మాట్లాడారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. మంత్రి అంబటి శనివారం ( జులై 29) విజయవాడలో పోలవరంపై వీడియో ప్రజంటేషన్ ఇచ్చారు. కేంద్రం పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్ ను టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు తీసుకొని ఏటీఎంలా వాడుకున్నారని ప్రధాని మోదీనే అన్నారు. ఎన్టీఆర్ అల్లుడు కావడం వల్లే చంద్రబాబు సీఎం అయ్యాడు. బాబు.. నీకు సైకిల్ గుర్తు ఎలా వచ్చిందో చెప్పు అని అంబటి ప్రశ్నించారు.
టీడీపీ హయాంలో పోలవరంపై ఏనాడైనా ఆలోచించారా? అని ప్రశ్నించారు. పోలవరంపై చంద్రబాబుకు అసలు చిత్తశుద్ధే లేదన్నారు. చంద్రబాబు జీవితమంతా అబద్ధాలమయమని సెటైర్లు వేశారు. చంద్రబాబు శనిపాదం అడుగుపెడితే వర్షాలే పడవని.. ఈ రాష్ట్రానికి పట్టిన శని చంద్రబాబేనని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అధికార దాహంతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. పోలవరాన్ని చంద్రబాబు టీడీపీ హయాంలో కమీషన్ల కోసమే తాపత్రయపడ్డారు. రాష్ట్రానికి, పోలవరానికి పట్టిన శని చంద్రబాబు. చంద్రబాబు నైజం గురించి ప్రధానికి బాగా తెలుసు. చంద్రబాబును నేను తిట్టలేనా?.. కానీ నాకు సంస్కారం ఉంది.