వారివి యూజ్ లెస్ మాటలు... కానీ అధికారం కావాలట..

వారివి యూజ్ లెస్ మాటలు... కానీ  అధికారం కావాలట..

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి బొత్స సత్యనారాయణ.   విజయనగరం జిల్లా వేపాడ మండలం వల్లంపూడి గ్రామంలో సచివాలయ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను సభా వేదికపై నుంచి ఖండించారు. చేతిలో మైక్ ఉందని ఏది పడితే అది మాట్లాడకూడని పవన్ కు హితవు పలికారు. సినీ డైలాగ్ లను...రాజకీయ వేదికలపై చెపుతూ...స్వార్థం కోసం నీతిమాలిన రాజకీయాలు చేసిన వారికి పగ్గాలు అప్పజెప్పాలా? లేదా ప్రజా సంక్షేమం కోరి ఎన్నో పథకాలు అందించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ కు పగ్గాలు అప్పజెప్పాలా మీరే చెప్పండి? అంటూ  ప్రజలను ప్రశ్నించారు మంత్రి బొత్స సత్యనారాయణ.

పవన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన బొత్స.. మైకుందని పవన్‌ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారా? అని నిలదీసిన ఆయన.. యూజ్ లెస్ మాటలు మాట్లాడే వారికి అధికారం కావాలట .. అని సెటైర్లు వేశారు. పని చేసేవాళ్లని చెడగొట్టటానికేనా..? ఇష్టం వచ్చినట్లు మాట్లాడేది..  అని ప్రశ్నించారు. రాజకీయాల కోసం ఇలా మాట్లాడడం సరైందా..? ఇలాంటి వాళ్లకి అధికారం కావాలంట.. ఇదేం దౌర్భాగ్యాం మనకి.. అంటూ విరుచుకుపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ.