కాంగ్రెస్, బీజేపీ నాయకులవి సిగ్గులేని మాటలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. ఆ పార్టీల నాయకులు ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియడం లేదని ఎద్దెవా చేశారు. వారి మాటలు ఎవరూ నమ్మెద్దని సూచించారు. 60 ఏండ్ల ముందు రాష్ట్రం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో చూడాలన్నారు.
అకాల వర్షాల వల్ల ఒక్క రైతు కూడా నష్టపోవద్దని సీఎం కేసీఆర్ ముఖ్య ఉద్దేశమని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. గతంలో మంత్రులు గ్రామాల్లో పర్యటిస్తే.. ప్రస్తుతం సీఎం కేసీఆరే స్వయంగా గ్రామాల్లో పర్యటిస్తున్నారన్నారు. వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా ఉండేందుకు.. ఒక లక్షా 30 వేల మెట్రిక్ టన్నుల గోదాములు పూర్తి కాబోతున్నాయని మంత్రి చెప్పుకొచ్చారు.
ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు పంటనష్టపోతే.. కనీసం 5వేలనష్టపరిహారం కూడా ఇవ్వలేదన్న మంత్రి.. మన రాష్ట్రంలో ఒక్క ఎకరాకు రూ. 10వేల నష్టపరిహారం ఇస్తున్నామని తెలిపారు. కేసీఆర్ పాలనను, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను దేశమంతా కోరుకుటుందని మంత్రి తెలిపారు.